ఆర్మీ స్కూల్స్లో టీజీటీ, పీజీటీ, పీఆర్టీ 8000 ఉద్యోగాలు,
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో దేశవ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే ‘ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్-2020’ ప్రకటన విడుదలైంది. ఈ స్కూళ్లన్నీ సీబీఎస్ఈ అఫిలియేషన్స్తో నడుస్తున్నాయి. వీటిని ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. ఆర్మీలో పనిచేసేవారి పిల్లల కోసం అత్యాధునిక సౌకర్యాలు, ప్రొఫెషనల్ టీచర్లతో వీటిని నిర్వహిస్తున్నారు.
పేరు: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్- 2020
పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్టీ
మొత్తం ఖాళీలు: 8000
ఎవరు అర్హులు?
పీజీటీ: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.
టీజీటీ: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.
పీఆర్టీ: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ/రెండేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు: 2020, ఏప్రిల్ 1నాటికి ఫ్రెషర్స్కు 40 ఏండ్లు మించరాదు. అనుభవం ఉన్నవారికి 57 ఏండ్లు మించరాదు. (గత 10 ఏండ్లలో కనీసం 5 ఏండ్లు టీచింగ్లో అనుభవం ఉండాలి)
టీజీటీ/పీఆర్టీ పోస్టులకు సీటెట్/టెట్ తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. సీటెట్/టెట్ క్వాలిఫై కానివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారిని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
సబ్జెక్టులు
పీజీటీ: ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మాటిక్స్, హోంసైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్.
టీజీటీ: ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.
ఎంపిక విధానం: మూడు దశల్లో ఉంటుంది.
స్టేజ్- 1: స్క్రీనింగ్ పరీక్ష. దీన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి స్కోర్ కార్డులు ఇస్తారు. ఇవి మూడేండ్లపాటు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. స్టేజ్-1లో అర్హత సాధించినవారిని మిగిలిన దశలకు అనుమతిస్తారు.
స్టేజ్ -2 ఇంటర్వ్యూ: దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
స్టేజ్ -3: టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీని ఈ దశలో పరీక్షిస్తారు. లాంగ్వేజ్ టీచర్లకు రాతపరీక్షలో
15 మార్కులకు ఎస్సే, కాంప్రహెన్షన్స్ ఇస్తారు. వీటితోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్: 2020, నవంబర్ 21, 22
పరీక్ష మల్టిపుల్ చాయిస్ (ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటుంది.
పీజీటీ/టీజీటీ పరీక్ష కాలవ్యవధి 3 గంటలు. పీఆర్టీకి 90 నిమిషాలు.
పీజీటీ/టీజీటీ, పీఆర్టీ పరీక్షను 90 మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు.
ప్రతి విభాగంలో కనీసం 50 శాతం మార్కులు వస్తే క్వాలిఫైగా పరిగణిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లోఫీజు: రూ. 500/-
చివరితేదీ: అక్టోబర్ 20 (సాయంత్రం 5 గంటల వరకు)
అడ్మిట్ కార్డులు: నవంబర్ 4 నుంచి
పరీక్షతేదీలు: నవంబర్ 21, 22
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 77 ఉన్నాయి.
ఫలితాల వెల్లడి: డిసెంబర్ 2
వెబ్సైట్: http://aps-csb.in
రాష్ట్రంలో పబ్లిక్ స్కూల్స్
ఆర్మీ పబ్లిక్ స్కూల్:
గోల్కొండ, సికింద్రాబాద్ (ఆర్కే పురం), బొల్లారం.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్
-----------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్ఎఫ్లో 228 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు,
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీరింగ్, ఎయిర్ వింగ్ గ్రూప్-సీలో ఖాళీగాఉన్న 228 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్, జేఈ లేదా ఎస్సై, ఏసీ, హెచ్సీ, ఏఎస్సై పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 228
ఇందులో కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ (బీఎస్ఎఫ్)-75, కానిస్టేబుల్ (ట్రెడ్స్మెన్)-75, గ్రూప్ బీ ఇంజినీరింగ్ కేడర్-52, గ్రూప్ సీ ఎయిర్ వింగ్ కేడర్-22, గ్రూప్ సీ-64, ఇంజినీరింగ్ కేడర్-15 పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు 18 నుంచి 28 ఏండ్ల లోపువారై ఉండాలి. కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్టుకు రెండేండ్ల అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: పీఎస్టీ, పీఈటీ, డ్యాక్యుమెంటేషన్, ట్రేడ్టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ
ఇంజినీరింగ్ క్యాడర్ పోస్టులకు- అక్టోబర్ 15
గ్రూప్ బీ ఇంజినీరింగ్ క్యాడర్, ఎయిర్ వింగ్, కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్టులకు- అక్టోబర్ 23
గ్రూప్ సీ పోస్టులకు- అక్టోబర్ 28
వెబ్సైట్: recttuser.bsf.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీలో 44 ఫోర్మెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు అధికారిక వెబ్సైట్లో ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా ఫోర్మెన్, స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇతర పోస్టులను భర్తీచేయనుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 44
ఇందులో కేంద్ర రక్షణ శాఖలోని ఫోర్మెన్-5 పోస్టులు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్)-5, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (మెటలర్జీ)-1, స్పెషల్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్-33 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 40 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 29
హార్డ్కాపీల సమర్పణకు చివరితేదీ: అక్టోబర్ 30
వెబ్సైట్: upsc.gov.in